జె. ఎన్. టి. యు. స్వయం ప్రతిపత్తి కళాశాలల సమావేశంలో క్విస్ ఇంజినీరింగ్ కళాశాల
ప్రొఫెసర్
వి.ఎస్.ఎస్. కుమార్ జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం (కాకినాడ)
కు నూతన ఉప-కులపతిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జె. ఎన్. టి. యు. కె.
కు అనుబంధం గా ఉన్న అటానమస్ ఇంజినీరింగ్ కళాశాలలు, యు. జి. సి. నుండి
త్వరలో స్వయం ప్రతిపత్తి హోదా సాధించానున్న ఇతర ఇంజినీరింగ్ కళాశాలలకు
'చాయిస్ బేస్డ్ క్రెడిట్స్' విధానం పై యు. జి. సి. ఇటీవల జారీ చేసిన నూతన
మార్గదర్శక సూత్రాలపై అవగాహన ఏర్పరిచే నిమిత్తం నిర్వహించిన సమావేశంలో
క్విస్ ఇంజినీరింగ్ కళాశాల పాల్గొన్నట్లు కళాశాల ప్రధానాచార్యులు తెలిపారు.
ప్రకాశం జిల్లా నుండి ఈ సమావేశానికి ఆహ్వానం పొందిన ఏకైక కళాశాల క్విస్
కావడం గర్వకారణమని క్విస్ విద్యాసంస్థల అధ్యక్షులు శ్రీ ఎన్. నాగేశ్వర
రావు, కార్యదర్శి శ్రీ ఎన్. ఎస్. కల్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. విశ్వ
విద్యాలయ రిజిస్ట్రార్ డా. ప్రసాద్ రాజు, రెక్టర్ డా. ప్రభాకర రావు, డి. ఇ.
డా. సాయి బాబు, డి. ఎ. పి. డా. ఉదయ భాస్కర్ లు ఈ సమావేశంలో 12 అనుబంధ
కళాశాలలకు వినూత్న పాఠ్య ప్రణాళికల రూపకల్పన, మెరుగైన మూల్యాంకన విధానం,
మార్కులకు బదులుగా 10-పాయింట్ల గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టడం మొదలైన
అంశాలపై దిశానిర్దేశం చేశారు. క్విస్ ఇంజినీరింగ్ కళాశాల ప్రతినిధులుగా
డా. కె. వీరాస్వామి, డా. ఎమ్. ఎల్. మల్లికార్జున ఈ సమావేశానికి హాజరయ్యారు.
QIS Engineering Colleges Gets Invitation to JNTU-K Autonomous Colleges Meet