Sunday, 5 April 2015

5 April 2015

క్విస్ ఇంజినీరింగ్ కళాశాల లో బాబూజీ జయంతి వేడుకలు

ప్రముఖ దళిత నాయకులు స్వర్గీయ బాబూ జగజ్జీవన్ రామ్ 107 వ జయంతిని పురస్కరించుకుని క్విస్ ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థినులు రామానుజన్ ఆడిటోరియం లో ఆదివారం సాయంత్రం స్మారక సభ నిర్వహించారని కళాశాలల ప్రధానాచార్యులు డా. కె. వీరా స్వామి, డా. జి. లక్ష్మీనారాయణ రావు తెలిపారు. గణిత విభాగానికి చెందిన ప్రొఫెసర్ బి. ప్రియ, శ్రీమతి ప్రశాంతి, జవహర్ నాలిజ్ సెంటర్ (జె.కె.సి.) ప్రతినిధి శ్రీమతి అనూష ముఖ్య వక్తలుగా పాల్గొన్న ఈ సభలో మూడవ సంవత్సరం బి.టెక్. విద్యార్థినులు అలేఖ్య, లిఖిత సమన్వయకర్తలుగా వ్యవహరించారు. వక్తలు తమ ప్రసంగాలలో, సామాజిక న్యాయం కోసం అలుపెరుగని పోరాటం సలిపిన మహోన్నత వ్యక్తి బాబూజీ అని కొనియాడారు. విద్యార్థినులు శ్రీ అనూష, మౌనిక, మాధురి, రాజి బాబూ జగజ్జీవన్ రామ్ జీవితం లోని వివిధ దశలను స్మరించుకుంటూ ఆయన బాల్యం, విద్య, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పాత్ర, బాబూజీ రాజకీయ ప్రస్థానం మొదలైన అంశాలను గూర్చి స్థూలంగా వివరించారు. శ్రీ నిడమానూరి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు శ్రీ ఎన్. నాగేశ్వర రావు, క్విస్ విద్యా సంస్థల అధిపతి శ్రీ ఎన్.ఎస్. కళ్యాణ చక్రవర్తి బాబూజీ స్మృతి కి నివాళులర్పిస్తూ సందేశాలు పంపారు.

No comments:

Post a Comment